PM Modi : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మధ్యప్రదేశ్లోని సాగర్లో బుధవారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్పై ఘాటు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తన మరో విధానాన్ని ఇప్పుడు బయటపెట్టిందని అన్నారు. వారి రహస్య అజెండా బయటకు వచ్చిందని అంటూ వారసత్వ పన్ను విధిస్తామని కాంగ్రెస్ చెబుతోందని ప్రధాని వివరించారు.
తల్లితండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులపై పన్ను విధిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసిందని అన్నారు. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిని మీ పిల్లలకు ఇచ్చే క్రమంలో మీ ఆస్తిలో దాదాపు సగం పన్ను పేరుతో కాంగ్రెస్ లాగేసుకుంటుందని ఆరోపించారు. భారత కుటుంబ విలువల గురించి కాంగ్రెస్కు ఏమీ తెలియదని ప్రధాని మోదీ మండిపడ్డారు.
కాంగ్రెస్ మంత్రం ఒకటేనని, జీవితంలోనూ..మరణించిన తర్వాత కూడా లూటీ చేయడమే ఆ పార్టీ ఉద్దేశమని విమర్శించారు. మధ్యతరగతి ప్రజల వద్ద అధిక మొత్తంలో పన్నులు వసూల్ చేయాలని గాంధీ కుటుంబానికి చెందిన సలహాదారుడు కామెంట్ చేశారని, ఇప్పుడు మరింత దూకుడుగా ఆయన మాట్లాడారని, వారసత్వ సంపదపై పన్ను వసూల్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ వేస్తోందని అంతకుముందు చత్తీస్ఘడ్లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో మోదీ ఆరోపించారు.
Read More :