Food Poisoning | ఓ వివాహాది కార్యక్రమంలో (wedding ceremony) ఆహారం తిని సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.
అంబేడ్కర్ నగర్ (Ambedkar Nagar)లో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన వారు అక్కడ వడ్డించిన ఆహారాన్ని తిన్నారు. అనంతరం 70 మందికిపైగా అస్వస్థతకు గురై అసుపత్రి పాలయ్యారు (hospitalised). ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ‘పెళ్లిలో భోజనం చేసిన తర్వాత వారు అస్వస్థతకు గురయ్యారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు (Food Poisoning). ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది’ అని అధికారులు తెలిపారు.
#WATCH | Uttar Pradesh: 70 people hospitalised after having food at a wedding ceremony in Ambedkar Nagar pic.twitter.com/iwHEPMUzqo
— ANI (@ANI) April 24, 2024
Also Read..
Robert Vadra | అమేఠీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ..? చర్చకు దారితీస్తున్న పోస్టర్లు
Kangana Ranaut | దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపై ఆ అలలు కొనసాగుతాయ్ : కంగనా రనౌత్
Tesla layoffs | ఈవీ దిగ్గజం కొలువుల కోత : 6 వేల మందిపై టెస్లా వేటు