హైదరాబాద్ : ఇతర రాష్ట్రాల నుంచి డీజిల్ అక్రమ రవాణా(DieselSmuggling) చేస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. కర్నాటక(Karnataka) నుంచి డీజిల్ రవాణా చేస్తున్న ఏడుగురు ట్యాంకర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా రవాణా చేసిన డీజిల్ను డోర్ డెలివరీ చేస్తూ పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి రూ. 35 లక్షల విలువైన డీజిల్, ఏడు ట్యాంకర్లు, జనరేటర్, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.