ఖమ్మం రూరల్, ఆగస్టు 18 : సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో మంగళ, బుధవారం రెండు రోజుల రిలే దీక్షలు ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో జలగం నగర్లో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రారంభించారు, ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు పెరుమాళ్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ.. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ వర్కర్స్ కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వర్కర్స్ కు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నేరవేర్చలేదన్నారు.
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, పంచాయతీ వర్కర్స్ ను 2వ పీఆర్సీలో గుర్తించాలని,
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల నిర్మాణం చేసివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎండీఓ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకుడు పొన్నం వెంకటరమణ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకుడు వల్లపు అనురాధ, మండల నాయకుడు ప్రభాకర్, చరణ్, చింతేటి వెంకటేశ్వరరావు, వీరబాబు, ఉప్పలి జయమ్మ, సైదమ్మ, డి.వెంకన్న, సంజీవులు పాల్గొన్నారు.