యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొదటి నుండి సమస్యలు తలెత్తుతున్నాయి. సినిమా ప్రారంభమైన రోజే ఫైర్ యాక్సిడెంట్ కావటం, ఆ తరువాత సైఫ్ అలీ ఖాన్ వివాదం , షెడ్యూల్ కాస్త గాడిలో పడింది అనుకున్న సమయానికి ముంబైలో లాక్ డౌన్ పెట్టడం దీంతో షూటింగ్ వాయిదా పడడం జరిగింది.ఇక హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రీన్ మ్యాట్లో చేయాలని నిర్ణయించుకునే సరికి ఇక్కడ కూడా లాక్డౌన్ పెట్టేశారు. దీంతో షూటింగ్ మళ్లీ వాయిదా పడింది.
ఆదిపురుష్ చిత్ర్ం రామాయణం సంభందించిన సబ్జెక్టు కదా ..ఆ వైపు నుంచి ఏదన్నా దోషం ఉందేమోనని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దోషం తొలగిపోయేందుకు హోమం చేయాలని అనుకుంటున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా ‘ఆదిపురుష్’లో సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు. అంగద్ బేడీ ఇంద్రజిత్ గా లక్ష్మణుడి పాత్రకు సోనూకి టిటులీ ఫేం.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ని ఎంపిక చేశారు. 300 కోట్ల వ్యయంతో టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.