Union Budget 2022 – Battery Swapping Policy | ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహకాలు అందించనుంది. వీటితో పాటు ఛార్జింగ్ సమస్యను తీర్చేందుకు వీలుగా సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పార్లమెంటులో జరిగిన బడ్జెట్ ( Budget 2022 ) ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు రాయితీలను ప్రకటిస్తున్నాయి. కానీ చాలావరకు జనాలు ఈవీ వెహికిల్స్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఛార్జింగ్ సమస్య. బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి గంటల తరబడి సమయం అవుతుంది. దీంతో దూర ప్రయాణాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఛార్జింగ్ కోసమే సమయం అంతా వృథా అవుతుంది. ఈ కారణంతోనే చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలోనే బ్యాటరీ స్వాపింగ్ పాలసీని తీసుకొస్తున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించారు. జాతీయ రహదారులపై ప్రతి 40 కిలోమీటర్లకు ఒక బ్యాటరీ స్వాపింగ్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
మన దగ్గర ఉన్న బ్యాటరీ ఇచ్చి వేరొక బ్యాటరీ తీసుకెళ్లడమే బ్యాటరీ స్వాపింగ్. అంటే ఛార్జింగ్ అయిపోయిన మన బ్యాటరీని స్వాపింగ్ సెంటర్లో ఇచ్చి దాని బదులు ఫుల్ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీని తీసుకెళ్లవచ్చు. ఇదే బ్యాటరీ స్వాపింగ్ పాలసీ. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే బ్యాటరీ ఛార్జింగ్ చేయడం కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. స్వాపింగ్ సెంటర్కు వెళ్లి పెట్రోలు, డీజిల్ పోయించుకునే అంత సమయంలోనే బ్యాటరీని మార్చుకుని వెళ్లవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Nirmala on Crypto | త్వరలో క్రిప్టో కరెన్సీ పేరెంటో వెల్లడిస్తాం!
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ 2022-23.. కేటాయింపులు ఇలా..
Budget 2022 | ఇక మీ పాస్పోర్టుల్లో చిప్ ఉంటుంది.. ఒకవేళ ఆ చిప్ ట్యాంపర్ అయితే ఎలా?
Digital rupee | డిజిటల్ రూపాయికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇంతకీ క్రిప్టో కరెన్సీ ఎలా పుట్టింది?