TATA Tigor | కస్టమర్లంతా ఆసక్తితో ఎదురుచూస్తున్న టాటా మోటార్స్ ఆవిష్కరించనున్న ఎలక్ట్రిక్ కారు టాటా టైగోర్ కొనుగోలుదారుల కోసం శనివారం బుకింగ్స్ ప్రారంభించింది. ఈ సంస్థ నుంచి వెలువడిన నెక్సాన్ ఈవీ తర్వాత మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కారు ఇది. ఆసక్తి గల వారు టాటా మోటార్స్ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో రూ.21 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో అందరి ద్రుష్టి ఎలక్ట్రిక్ వాహనాలపైనే పడింది. ఈ నెల 31వ తేదీన ఆవిష్కరించనున్న టాటా టైగోర్ ఈవీ మూడు వేరియంట్లలో లభ్యం కానున్నది. ఎక్స్జడ్+డీటీ, ఎక్స్జడ్ +ఎక్స్ ఎం మోడల్ కార్ల ధరలు విపణిలోకి అడుగు పెట్టే సమయంలో వెల్లడిస్తామని టాటా మోటార్స్ తెలిపింది.
టాటా టైగోర్ ఈవీ డిజైన్ మొత్తం ప్రక్షాళన చేసింది టాటా మోటార్స్. టాటా టియాగో, టాటా ఆల్టోజ్ మాదిరిగానే టాటా టైగోర్ డిజైనింగ్ కనిపిస్తుంది. ప్రత్యేకించి టాటా టైగోర్ ఈవీ వీల్స్ పర్యావరణ ఫ్రెండ్లీగా ఉంటాయి.
టాటా టైగోర్ ఈవీలో ఐపీ 67 డస్ట్తోపాటు వాటర్ రెసిస్టెంట్ గల 26 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. 73.75 హెచ్పీ, 170 ఎన్ఎం టార్చి విడుదల చేసే సామర్థ్యం ఈ బ్యాటరీకి ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే 250 కి.మీ. దూరం ప్రయాణించే సత్తా దీని సొంతం.
టాటా టైగోర్ ఈవీని జిప్ట్రోన్ టెక్నాలజీతో అభివ్రుద్ధి చేసినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. కేవలం 5.7 సెకన్లలో 60 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు.
రక్షాబంధన్ రోజున ఆరోగ్య రక్ష.. ఇలా ట్రై చేయండి..!
మన సంస్కృతి, వారసత్వం గురించి యువత తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు
ఆఫ్ఘాన్లో క్రికెట్ భవితవ్యం ఏంటి..?
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడగింపు
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..