హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమవడంతోనే మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి రోజు ట్రేడింగ్లో మిశ్రమ ఫలితాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. బుధవారం ఉదయం 11 గంటల వరకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సూచీ సెన్సెక్స్ 501 పాయింట్లు కోల్పోయి 49,635 స్థాయికి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 115 పాయింట్లు కోల్పోయి 14,730 స్థాయికి పడిపోయింది. ఒక్క ఫార్మా రంగం తప్ప ఇవాళ అన్ని రంగాలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతం పతనమైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..