ముంబై: సొంతిల్లు కొనుక్కోవాలని భావిస్తున్నారా.. అయితే.. ఎస్బీఐ తన ఖాతాదారులకు స్పెషల్ మాన్సూన్ ధమాకా పేరిట బంపర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఇంటి కొనుగోలు కోసం రుణాలు తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు మినహాయిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ ఆఫర్ ఆగస్టు 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
నూతన ఇండ్ల కొనుగోలుదారులకు ఆఫర్ల వర్షం.. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఇంటి లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి.. అని పేర్కొంటూ ఎస్బీఐ ట్విట్టర్ హ్యాండిల్ ప్రకటించింది. ప్రస్తుతం రుణ గ్రహీతలు తీసుకునే ఇంటి రుణంపై 0.40 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఎస్బీఐ యాప్ యోనో ద్వారా గానీ, మహిళారుణ గ్రహీతలకు గానీ అదనంగా 0.5 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని తెలిపింది. కన్జూమర్ సెంటిమెంట్ బలోపేతం చేయడానికి తాము ఈ ఆఫర్ అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇంటి లోన్ ఎస్బీఐ 6.7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
ఇంటి రుణాలపై ఎస్బీఐ వడ్డీరేటు చారిత్రక స్థాయిలో తక్కువగా ఉందని బ్యాంక్ రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి తెలిపారు. జాతి నిర్మాణంలో భాగస్వాములుగా ఇంటి కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ఈ రాయితీ అందుబాటులోకి తెచ్చామన్నారు. పూర్తి వివరాలకు sbiyono.sbiను సంప్రదించాలి తెలిపింది ఎస్బీఐ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!