న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (Reserve Bank Of India) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజయ్ కుమార్ను నియమించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అతడి నియామకం ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకానికి ముందు ఆయన న్యూఢిల్లీలోని రీజనల్ డైరెక్టరేట్లో రీజనల్ డైరెక్టర్గా వ్యవహరించారు. కరెన్సీ మేనేజ్మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్మెంట్, ప్రిమిసెస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా అజయ్ కుమార్ బాధ్యతలు చూస్తారు. సెంట్రల్ బ్యాంక్లో అజయ్ కుమార్కు మూడు దశాబ్దాల అనుభవం ఉన్నది.
పాట్నా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ, ఇక్ఫాయ్ నుంచి ఎంఎస్, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్, రీసెర్చ్ నుంచి సర్టిఫైడ్ బ్యాంక్ మేనేజర్ కోర్సులు చదివారు. చికాగోలోని కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను కూడా పూర్తిచేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్టిఫైడ్ అసోసియేట్తో పాటు ఇతర వృత్తిపరమైన అర్హతలు కూడా కలిగి ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మూడేండ్ల పదవీకాలం కూడా 2021 డిసెంబర్ నెలలో ముగియనున్నది.
7,200 ఏండ్ల క్రితం మహిళ శరీరంలో డీఎన్ఏ గుర్తింపు
త్వరలో గూగుల్ పే ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్
సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
గుండె వైఫల్యం ప్రమాదమా..? ఇలా గట్టెక్కొచ్చు..!
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..