జకార్తా : ఇండోనేషియాలో 7,200 సంవత్సరాల క్రితం మరణించిన ఒక మహిళ అవశేషాల్లో (Genetic Fossil) పురాతన డీఎన్ఏను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రారంభ మానవుల వలసల గురించి గతంలో తెలిసిన వాటిని సవాలు చేస్తున్నది.
బెస్సే అనే మారుపేరు గల యువతికి చెందిన అవశేషాలను ఇండోనేషియా ద్వీపమైన సులావేసిలోని లియాంగ్ పన్నింజ్ గుహలో శాస్త్రవేత్తలు గుర్తించారు. 2015 లో కూడా ఇదే ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాల గురించి, అతిపురాతన మహిళకు చెందిన అవశేషాల్లో డీఎన్ఏను గుర్తించినట్లు నేచర్ జర్నల్లో అధ్యయనం ప్రచురించారు. ప్రాచీన మానవ డీఎన్ఏను ఆసియా, ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం మధ్య సముద్రంలోని ద్వీపాలు, వాలెసియాలో కనుగొన్నారు.
బెస్సే లోపలి చెవి ఎముక పెట్రస్ భాగం నుంచి డీఎన్ఏను సేకరించినట్లు పరిశోధనకు సహ-నాయకత్వం వహించిన గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆడమ్ బ్రమ్ చెప్పారు. చెక్కుచెదరకుండా ఉన్న ఈ డీఎన్ఏ చాలా అరుదైనదని ఆయన తెలిపారు.
టెస్టియన్ సంస్కృతికి చెందిన మొట్టమొదటి అస్థిపంజరం కూడా బెస్సేదే. ఇది 1,500-8,000 సంవత్సరాల క్రితం దక్షిణ సులవేసిలో నివసించిన వేటగాళ్ల కుటుంబానికి చెందినదిగా భావిస్తున్నారు. ఖననం చేసే సమయంలో ఆమె వయస్సు 17 నుంచి 18 సంవత్సరాలు ఉంటుందని గుర్తించారు. ఆమె అవశేషాలతో పాటు చరిత్రపూర్వ రాతి ఉపకరణాలు, ఎరుపు రంగు ఓచర్ కనుగొన్నారు. ఆమె సమాధిలో వేటాడిన అడవి జంతువుల ఎముకలు కూడా ఉన్నాయి.
త్వరలో గూగుల్ పే ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్
సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
గుండె వైఫల్యం ప్రమాదమా..? ఇలా గట్టెక్కొచ్చు..!
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..