ముంబై: కరోనా రెండో వేవ్ దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో బ్యాంకుల రుణాల చెల్లింపుపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మలి విడుత మారటోరియం అందుబాటులోకి తెచ్చింది. రుణ గ్రహీతలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని బ్యాంకర్లకు ఆర్బీఐ సూచించింది.
రూ.25 కోట్ల వరకు రుణాలు తీసుకున్న వ్యక్తులు, చిన్న వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. గతేడాది రుణాల పునర్వ్యవస్థీకరణ ఫ్రేమ్వర్క్ కింద దరఖాస్తు చేసుకోని వారికి వర్తిస్తుంది. తొలి మారటోరియం సద్వినియోగం చేసుకున్న రుణ గ్రహీతలకు కూడా వర్తిస్తుంది.
గతేడాది తొలుత రుణ వాయిదాల చెల్లింపుపై 2020 మార్చి ఒకటో తేదీ నుంచి మే 30 వరకు ఆర్బీఐ మారటోరియం విధించింది. తదుపరి ఆగస్టు వరకు పొడిగించింది. అటుపై రుణ గ్రహీతలు తమ బ్యాంకర్లతో సంప్రదించి రెండేండ్ల వరకు రుణ పునర్వ్యస్థీకరణ ద్వారా మారటోరియం విధించుకోవచ్చునని సూచించింది.
మారటోరియం నిబంధనను వాడుకోవడం వల్ల రుణ గ్రహీతపై డీఫాల్టర్ ముద్ర పడకుండా నివారించవచ్చు. డీఫాల్ట్గా మారితే రుణ వాయిదా చెల్లింపులు ప్రియం అవుతాయి. మీ క్రెడిట్ స్కోర్ పరిస్థితి దారుణంగా మారుతుంది. తొలి మారటోరియం పొందిన వారు కూడా.. రెండేండ్ల వరకు మిగతా రుణ వాయిదాలను పొడిగించుకోవచ్చు.
2021 సెప్టెంబర్ 30 వరకు రుణ గ్రహీతలు తమ రుణ వాయిదాల చెల్లింపు విషయమై తమ బ్యాంకర్లను కోరేందుకు టైం ఉంది. మారటోరియం కోసం సమర్పించిన దరఖాస్తును 90 రోజుల్లో బ్యాంకులు ఆమోదించి రుణాలను పునర్వ్యవస్థీకరించనున్నాయి.
కరోనా ఎఫెక్ట్ : ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవలు, వారానికి నాలుగు రోజుల పని!
ఎంపీ తేజస్విని కసబ్తో పోల్చిన యాక్టర్ సిద్దార్థ్
కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం.. భారతీయులకే ఎక్కువ ప్రయోజనం
ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ రాకెట్ రట్టు
ప్రైవేటీకరణకు మరో బ్యాంకు రెడీ..
బ్రీఫ్కేస్ పరిమాణంతో వెంటిలేటర్
ఇక ఒక్కరోజులోనే డేట్..మీట్..చాట్!
క్రిప్టో ట్రేడింగ్పై నిషేధానికి ఎన్పీసీఐ నో..