ముంబై ,మే 6: ఈరోజు బంగారంధర స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.109 పెరిగి రూ.46980 వద్ద, కిలో వెండి ధర రూ.19 తగ్గి రూ. 69,630 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ పెరిగి 1780 డాలర్లు దాటగా, సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గి 27 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేయడానికి వెనుకంజ వేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.