న్యూఢిల్లీ: కరోనా థర్డ్వేవ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే నేర్చుకున్న పాఠాలు, అనుభవాలతో మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు సైతం సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత్ రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేశారు.
ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా ఇప్పటికే పలు సంకేతాలు వెలువడుతున్నాయన్నారు. ప్రైవేట్ రంగంలోనూ పెట్టుబడులు పుంజుకుంటాయని చెప్పారు.
ఇప్పటికే ఉక్కు, సిమెంట్, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే, కస్టమర్లతో ప్రత్యక్షంగా సంబంధం గల రంగాలు గాడిలో పడడానికి ఇంకొంత సమయం పడుతుందన్నారు.
రెండో దశ కరోనా వల్ల స్టాక్ మార్కెట్లు పెద్దగా ప్రభావితం కాలేదని ఆయన గుర్తు చేశారు. అలాగే గతేడాదితో పాటు ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ దేశీయ కార్పొరేట్ సంస్థల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రికార్డు స్థాయిలో వచ్చాయన్నారు. పలు కంపెనీలు నిధులను సేకరించడానికి ఐపీఓకి వెళుతున్న సంగతి గుర్తు చేశారు.
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలు
గుడ్ న్యూస్.. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపు.. ఎంతంటే..!:
కార్లపై ఇన్ఫుట్ కాస్ట్ దెబ్బ.. మహీంద్రా థార్ ధరెంతంటే?!
ఇంధన డిమాండ్.. జూన్లో రికవరీ.. ఎలాగంటే..!!
చౌకగా లాప్టాప్లు.. రూ.24 వేల లోపు రెడీ.. ఇవీ డిటైల్స్..
బ్యాంకింగ్ అవకతవకలకు చెల్లు.. అందుకు ఆర్బీఐ కంపల్సరీ లీవ్
జనాభా నియంత్రణ తప్పనిసరి: శరద్ పవార్
కరోనా నుంచి కోలుకున్నాడు.. ఎవరెస్ట్ను అధిరోహించాడు
మోదీ కేబినెట్లో 90 శాతం మంది కోటీశ్వరులే..
పద్మ అవార్డులకు మీరే నామినేట్ చేయండి.. ప్రజలను కోరిన ప్రధాని మోదీ
దిగివచ్చిన ట్విటర్.. ఫిర్యాదు అధికారిగా వినయ్ ప్రకాశ్ నియామకం