న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజ్రుంభణతో వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరిగింది. స్కూళ్లు, విద్యాసంస్థలు మూత పడ్డాయి. దుకాణాలు మూత పడ్డాయి. ఫలితంగా లెర్నింగ్ ఫ్రం హోం కూడా ఇంటి వద్దే మొదలైంది. ఈ క్రమంలో ప్రాజెక్టు వర్క్, పలు అసైన్మెంట్ల లోడ్ పెరిగింది. దీంతో ప్రతి ఇంటిలో ఒక ల్యాప్టాప్ తప్పనిసరి అవసరంగా మారింది.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కొన్ని సంస్థలు చౌకగా తమ ఖాతాదారులకు లాప్టాప్లు అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యేకించి లెనెవో, లావా, హెచ్పీ సంస్థల ల్యాప్టాప్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి.
వర్చువల్ మీటింగ్ అయినా, ఆన్లైన్ క్లాస్ అయినా.. డేటా ఎంట్రీ వర్కైనా చాలా ఈజీ. తక్కువ బడ్జెట్లో సిద్ధంగా ఉన్నాయి. రూ.13 వేల నుంచి రూ.24 వేల లోపు అవి లభిస్తున్నాయి. అవేమిటో ఒకసారి చూద్దామా..
విండోస్ 10 సపోర్టెడ్ సిస్టమ్తో పని చేస్తుంది. 32 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 10 వేల ఎంఏహెచ్ కెపాసిటీ. ఇంటర్నెట్ ఈజీగా బ్రౌజ్ చేయొచ్చు. 1.1 గిగాహెర్ట్జ్స్ స్పీడ్ కల ప్రాసెసర్తోపాటు 2 ఎంపీ వెబ్ కామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 12,900 మాత్రమే.
దీని స్టోరేజీ సామర్థ్యం లావా హీలియం కంటే ఎక్కువే. 256 జీబీ నిల్వ కెపాసిటీ దీని సొంతం. 1.380 గ్రాముల బరువు ఉంటుంది. 2 ఎంపీ వెబ్కామ్తోపాటు 1.1 గిగా హెర్ట్స్జ్ స్పీడ్ గల ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్టాప్ రూ.18, 999లకు లభిస్తుంది.
దీని మెమొరీ 32 జీబీ. ఇంటెల్ ఆటోం ఎక్స్5 ప్రాసెసర్ లభ్యం అవుతుంది. దీని స్పీడ్ సామర్థ్యం 1.84 గిగా హెర్ట్స్జ్. ఇది రూ.19, 621లకు అందుబాటులో ఉంది.
చౌకధరకు అందుబాటులో ల్యాప్టాప్కు అనుగుణంగా ఫీచర్లు ఉంటాయి. దీని నిల్వ సామర్థ్యం 1 టీబీ. 2400 గ్రాముల బరువు ఉంటుంది. 3 గిగా హెర్ట్స్జ్ స్పీడ్ గల ప్రాసెసర్ ఉంటుంది. విండోస్ 10 సపోర్ట్ చేస్తుంది. దీనికి ఏడాది వారంటీ కూడా ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్ రూ.23,952లకు కొనుగోలు చేయొచ్చు.
దీని స్టోరేజీ కెపాసిటీ 64 జీబీ. 1.07 గ్రాముల బరువు ఉంటుంది. ఇన్బిల్ట్ స్పీకర్ కూడా లభ్యం అవుతుంది. ఈ ల్యాప్టాప్ రూ.22,990లకు లభిస్తుంది.