న్యూఢిల్లీ : ఎయిర్ కండీషనర్లు, ఎల్ఈడి లైట్ రంగాలకు ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్ మీడియా సమావేశంలో సమాచారం ఇచ్చారు. ఏసీలు, ఎల్ఈడీ లైట్ల తయారీలో నిమగ్నమై ఉన్న సంస్థలకు ఐదేళ్ల కాలానికి భారతదేశంలో తయారయ్యే వస్తువుల అమ్మకాలపై 4-6 శాతం ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పథకం భారతదేశం అంతటా అమలు చేయనున్నారు. ఇది ఒక ప్రదేశం, ప్రాంతం లేదా విభాగానికి ప్రత్యేకంగా ఉండదు.
దేశంలో సౌర పరికరాల తయారీని పెంచడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఈ పథకం దేశీయ తయారీకి ఊపునిస్తుందని ఆయన చెప్పారు. దీని కింద తయారీ సంస్థలకు ప్రోత్సాహకంగా రూ.4,500 కోట్లు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, ఎలక్ట్రికల్ గృహోపకరణాలకు పీఎల్ఐ పథకాన్ని కేంద్రం ఆమోదించింది.
విదేశాల నుంచి వస్తున్న 70-80 శాతం ఎయిర్ కండీషనర్లను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని ప్రకటించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఎల్ఈడీ లైట్ల విషయంలో భారత్ ప్రపంచంలో ముందున్నదని ఆయన పేర్కొన్నారు. ఉజాలా పథకం కింద ఎల్ఈడీ లైట్ల ధరలు కూడా తగ్గాయి. అదే సమయంలో, తయారీ కూడా వేగంగా వృద్ధి చెందింది.
13 పీఎల్ఐ పథకాలను అనుమతించేందుకు ప్రభుత్వం రూ.1.97 లక్షల కోట్ల బడ్జెట్ను ఏర్పాటు చేసినట్లు పియూష్ గోయల్ తెలిపారు. ఈ పథకాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ప్రపంచ సరఫరా గొలుసులో దేశానికి ముఖ్యమైన పాత్రను ఇస్తాయని ఆయన చెప్పారు. ఈ పథకం ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎగుమతులను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు.
ఐదేండ్లలో పీఎల్ఐ పథకం కింద రూ.7,920 కోట్ల పెట్టుబడులు పెరుగడం, రూ.1,68,000 కోట్ల విలువైన ఉత్పత్తులు పెరుగడం, రూ.64,400 కోట్ల ఎగుమతులు, రూ.49,300 కోట్లు ప్రత్యక్ష, పరోక్ష ఆదాయం సంపాదించడంతోపాటు అదనంగా నాలుగు లక్షల మేర ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
సరిహద్దులో చొరబాటుదారు హతం.. భారీగా మందుగుండు స్వాధీనం
పరంబీర్సింగ్తో వాజ్ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్ నివేదిక
జవాన్ రాజేశ్వర్ విడుదలకు చర్చలు షురూ!
బెంగాల్ ఎన్నికల్లో ‘కూపన్ల పంపిణీ’ వివాదం
పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్.. పండిత్ రవిశంకర్.. చరిత్రలో ఈరోజు
ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్కు 72 లక్షల జరిమానా
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..