న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కూడా 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.587 పెరిగి రూ.45,768కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.45,181 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం కూడా దేశంలో బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.682 పెరిగి రూ.65,468కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.64,786 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,739 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ సిల్వర్ ధర 25.04 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాతో బ్లడ్ క్లాటింగ్.. 30 మందిలో ఏడుగురు మృతి
సర్పంచ్ అభ్యర్థిగా 81 ఏండ్ల వృద్ధురాలు పోటీ..!
బీజేపీ సీఆర్పీఎఫ్ను నేను గౌరవించను: మమతాబెనర్జి
భారత సైన్యం మానవత్వం.. స్వదేశానికి పాకిస్థానీ యువకుడు.. వీడియో
రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేసిన హోంమంత్రి అమిత్ షా..!
భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
నేడు ప్రధాని ‘పరీక్షా పే చర్చ’
ఏనుగు పిల్లను భుజాలపై మోసుకెళ్లిన ఫారెస్ట్ గార్డ్.. వీడియో వైరల్