న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీ తడిసి మోపెడవుతున్నది. ఆరేండ్లలో పెట్రోల్పై రెట్టింపు ఎక్సైజ్ సుంకం విధించింది.. దాదాపు 88 శాతం ఎక్సైజ్ సుంకం పెంచేసింది కేంద్రం. ఇక డీజిల్పై ఎక్సైజ్ సుంకం మూడు రెట్లు పెరిగి 209 శాతం ధర ఎక్కువైంది. దేశంలోని పలు నగరాల్లో లీటర్ పెట్రోల్/ డీజిల్ ధర సెంచరీ (రూ.100) మార్క్కు దాటేసింది.
సెస్తో కలిపి ఈ నెల ఒకటో తేదీ నాటికి లీటర్ పెట్రోల్ మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90.. సరిగ్గా ఆరేండ్ల క్రితం 2015 జూలై ఒకటో తేదీన పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రూ.17.46 మాత్రమేనని అధికారిక డేటా చెబుతున్నది.
2015 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు గత ఆరేండ్లలో లీటర్ పెట్రోల్ మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ దాదాపు రెట్టింపై 88 శాతం పెరిగింది.
ఇదే కాలంలో లీటర్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ 209 శాతం ఎక్కువైంది. ఈ నెల ఒకటో తేదీన లీటర్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూ.31.80.. సరిగ్గా ఆరేండ్ల క్రితం 2015 జూలై ఒకటో తేదీన అది రూ.10.26.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. లీటర్ డీజిల్ ధర రూ.90-98 మధ్య తచ్చాడుతున్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది.
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?