న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారి ప్రయాణ టిక్కెట్ల మార్పిడి ఫీజును ఎయిర్లైన్స్ సంస్థలు మాఫీ చేశాయి. కరోనా వల్ల వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ముందస్తుగా ప్లాన్ చేసుకున్న ట్రిప్లను ప్రజలు వాయిదా వేసుకుంటున్నారు.
ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో.. విమాన ప్రయాణ టికెట్లు బుక్ చేసుకున్న వారి టిక్కెట్ల మార్పిడి ఫీజును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపింది.
న్యూ బుకింగ్స్లో ప్రయాణికులు అన్లిమిటెడ్ మార్పులు చేసుకోవచ్చునని ఇండిగో తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుందని పేర్కొంది.
అయితే, ప్రయాణ టికెట్లను రద్దు చేసుకున్న వారిపై క్యాన్సిలేషన్ ఫీజులో మార్పు లేదని ఇండిగో స్పష్టం చేసింది. ప్రయాణ తేదీ, విమాన నంబర్, సెక్టార్ పేరు కూడా మార్చుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ) సైతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కరోనా ఆంక్షల వల్ల ప్రయాణికులు పలు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!