న్యూఢిల్లీ : దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహమ్మారి బారినపడగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా, శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ మేరకు ఇద్దరు నేతలు శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘నేను ఈ రోజు కొవిడ్ పాజిటివ్గా పరీక్షించాను.
గత ఐదు రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేసుకోవడంతో పాటు ఐసోలేషన్లో ఉండాలి. అలాగే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత సూచించారు. ‘తేలికపాటి లక్షణాలు ఉండగా.. కొవిడ్ పరీక్ష చేయించుకోగా శుక్రవారం పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ తెలిపారు. వైరస్ సోకడంతో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నానని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.