డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో ఐదు రోజుల్లో 1,701 మందికి కరోనా సోకింది. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉన్నదని, అవి వస్తే బాధితుల సంఖ్య 2,000లకు చేరుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. కుంభమేళాలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులు కరోనా మార్గదర్శకాలను పాటించకుండా పవిత్ర స్నానాలు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. కాగా మధ్యప్రదేశ్లోని మహా నిర్వాని అకారా సంస్థ అధిపతి స్వామి కపిల్ దేవ్ కరోనాతో మరణించారు. కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు ఇటీవల పరీక్షలు నిర్వహించడంతో కరోనా బయటపడింది. దీంతో దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.