న్యూఢిల్లీ : (EV Charging) రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగే అవకాశాలు ఉండటంతో.. ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కీలక ప్రకటన చేసింది. త్వరలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం 10 వేల ఛార్జింగ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. మూడేండ్ల కాలవ్యవధిలో వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఐఓసీచైర్మన్ ఎస్ఎం వైద్య తెలిపారు.
‘రానున్న 12 నెలల్లో 2,000 ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. అనంతరం రెండేండ్లలో మరో 8 వేల తీసుకురావడం ద్వారా మూడేండ్లలో 10 వేల ఛార్జింగ్స్టేషన్ల ఏర్పాటు లక్ష్యాన్ని అందుకుంటాం’ అని ఎస్ఎం వైద్య వెల్లడించారు. విద్యుత్ వాహనాలకు డిమాండ్పెరుగుతున్న నేపథ్యంలో ఐఓసీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకున్నది. రిలయన్స్, భారత్పెట్రోలియం సంస్థలు కూడా ఈవీ ఛార్జింగ్స్టేషన్లుఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించాయి. ఈ రెండు సంస్థలూ సంయుక్తంగా సంబంధిత ఫ్యూయెల్పంపుల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి.
మూడో రోజు కొనసాగిన రైతుల మహా పాదయాత్ర
కార్తీకమాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేసేందుకు 75 శాతం మంది సిద్ధం : సర్వేలో వెల్లడి–
కొత్త శాఖ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ఉత్తర్వులు జారీ
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..