Jio | హైదరాబాద్, మే 8: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. తెలుగు రాష్ర్టాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మార్చి నెలలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో 1.06 లక్షల మంది కస్టమర్లు జియో నెట్వర్క్ను ఎంచుకున్నారు.
దీంతో జియో వినియోగదారుల సంఖ్య 3.27 కోట్లకు చేరుకున్నారు. మరోవైపు, తన పోటీ సంస్థయైన ఎయిర్టెల్ 97 వేల మంది జతవగా, ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ను 15, 432 మంది ఎంచుకున్నారు. కానీ, వొడాఫోన్ ఐడియా మాత్రం 48, 690 మంది కస్టమర్లను కోల్పోయింది. అలాగే మార్చి నెలలో దేశవ్యాప్తంగా జియో కొత్తగా 21.43 లక్షల మంది చేరారు. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 46.97 కోట్లకు చేరుకున్నారు.