Kakaitya University | కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వైస్ చాన్సలర్గా రమేశ్ తీసుకున్న నిర్ణయాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్)లోని కొందరు ప్రతినిధులు శుక్రవారం విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి ఫిర్యాదు చేశారు.
అక్రమాలు, ఆరోపణలతో తొలగించిన వారిని ఫ్యాకల్టీగా మళ్లీ నియమించడం, బదిలీలో అక్రమాలు, అకడమిక్ నియామకాల్లో అనైతిక చర్యలకు పాల్పడటం, నకిలీ ప్రాజెక్టుల పేరిట నిధులు ఖర్చు చేయడం, యూనివర్సిటీ భూములను కబ్జా చేసిన సంస్థలోని ఉద్యోగులపై చర్యల విషయంలో ఉదాసీనత వంటి అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని అంశాలపై విచారణ చేపట్టాలని బుర్రా వెంకటేశం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ మొదలుకానున్నది.