భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన,సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు, నిర్వహించారు.
శ్రీసీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను బేడా మండపంలో వేంచేపు చేసి ముందుగా విశ్వక్సేన ఆరాధన, ఫుణ్యఃవచనం చేశారు. అర్చకుల వేద మంత్రాల నడుమ కన్యాదానం, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుకతో శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం జరిపించారు. అనంతరం కల్యాణ దాతలకు రామయ్య ప్రసాదాలను అందజేశారు.