మణుగూరుటౌన్, ఏప్రిల్ 23 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలో పర్యటించిన కలెక్టర్ జిల్లా పరిషత్ కో-ఎడ్యుకేషన్ హైస్కూల్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎం బాక్సులను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.రాఘవరెడ్డి, డీఎస్పీ రవీందర్రెడ్డి, ఎస్సై సతీశ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.