ఖమ్మం, ఏప్రిల్ 23 : ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. అనంతరం నగరంలోని సీక్వెల్ ఫంక్షన్ హాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తల సమావేశం జరగనున్నది. ఇందులో హరీశ్రావుతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, సమావేశాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఒక ప్రకటనలో తెలిపారు.