పాల్వంచ: కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు మండలంలోని జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు వెల్లడించారు. పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా స్వగృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో నూతన కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన కమిటీ చైర్మన్గా పాల్వంచ పట్టణానికి చెందిన మహిపతి రామలింగం, మరో12మందితో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రేపు (ఆదివారం) ఈ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా మడలంలోని కేశవాపురం నుంచి భారీ ర్యాలీతో ఊరేగింపుగా బయల్దేరి వెళ్లి నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం జరుగు తుందన్నారు.
ఈ సమావేశంలో నాయకులు కిలారు నాగేశ్వరరావు, పట్టణ, మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, శ్రీరాంమూర్తి, జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, కాంపెల్లి కనకేష్, మల్లెల రవిచంద్ర, కాల్వ భాస్కర్, కనగాల బాలకృష్ణ, దాసరి నాగేశ్వరరావు, చల్లగుళ్ల వీరభధ్రం, నాగరాజు, బేతంశెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు.