భద్రాచలం : స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అందరికీ కనీస వేతనాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈ నెల 24న జాతీయ సమ్మెను తలపెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అన్నిసంస్థల్లో పనిచేస్తున్న వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మచారి పిలుపునిచ్చారు. మంగళవారం చర్లలోని గౌతమి డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలు, విద్యుత్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్ బాధ్యులు బాలాజీ, ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి చంద్రకళ, వీఓఏ యూనియన్ కార్యదర్శి అనురాధ తదితరులు పాల్గొన్నారు.