దుమ్ముగూడెం : ఏజెన్సీలో ఐటీడీఏ ద్వారా గిరిజన యువత ఉపాధి నిమిత్తం మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో రూ.40లక్షలతో ఏర్పాటు చేయనున్న పల్లీపట్టు తయారీ కేంద్రానికి సంబంధించిన గోడౌన్ను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ సోమవారం పరిశీలించారు. ఏజెన్సీ మండల పర్యటనలో భాగంగా లక్ష్మీనగరం వచ్చిన ఆయన గోడౌన్లో పల్లీపట్టు తయారీ కేంద్రానికి అవసరమైన యంత్ర సామాగ్రిని పరిశీలించారు.
పల్లీపట్టు తయారీ కేంద్రం ఏర్పాటు పదిరోజుల్లో పూర్తి చేయాలని సంబంధితశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. యూనిట్కు సంబంధించి యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ తయారీ కేంద్రంలో పనిచేసేందుకు ఆదిలాబాద్లో నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి పంపించాలని పీవో సూచించారు. విద్యుత్ సౌకర్యంతో పాటు తయారీ కేంద్రంలో అవసరమైన యంత్రసామాగ్రిని పదిరోజుల్లో సిద్ధం చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు.
ఈసందర్భంగా ఆయన వెంట జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఐటీడీఏ అగ్రికల్చర్ ఏపీవో సుజాత, ఐటీడీఏ ఏఈలు వెంకటేశ్వరరావు, ప్రసాద్, యూనిట్కు సంబంధించిన యువత, స్థానిక సీఐ వెంకటేశ్వర్లు, ఇతరశాఖల అధికారులు ఉన్నారు.