అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా మాతా, శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి సుజాత అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎర్రగుంట ప్రభుత్వ వైద్యశాలను ఆమె సందర్శించి, పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. వైద్యశాలలో అందిస్తున్న వైద్య సేవల వివరాలు, కొవిడ్ టీకా వివరాలను వైద్యాధికారి ప్రియాంకను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ… గ్రామాల్లో గర్భిణులను గుర్తించి వైద్యశాల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు క్రమం తప్పకుండా టీకాలను వేయాలని, నూరుశాతం కొవిడ్ టీకా వ్యాక్సీనేషన్ను పూర్తి చేయాలన్నారు.