చండ్రుగొండ: ఉపాధ్యాయులకు పరిమితికి మించి ప్రధానోపాధ్యాయులు ఎలా సెలవులు మంజూరు చేస్తారంటూ జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు ఎంతమంది ఉపాధ్యాయులకు సెలువులు ఇస్తారంటూ తిప్పనపల్లి యుపిఎస్, అంబేద్కర్నగర్ ఎంపిపిఎస్ పాఠశాలల హెచ్ఎంలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం డిఈఓ అకస్మికంగా తిప్పనపల్లి యుపిఎస్, అంబేద్కర్నగర్కాలనీ ఎంపిపిఎస్ పాఠశాలను, కస్తూర్బాగాంధి వసతిగృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎక్కువ మంది ఉపాధ్యాయులు సెలువులు ఎలా మంజూరు చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా రెండు సెలవులకు మించి వాడుకోవద్దని , అన్నారు. ప్రత్యేక తరగతులు తీసుకొని , సిలబస్ పూర్తి చేయాలని, కేజిబివిలో మెనూ పాటించాలన్నారు.