జూలూరుపాడు: మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పెద్దోజు విజయలక్ష్మి (54)సోమవారం రాత్రి మృతి చెందారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు పాఠశాలోని విద్యార్ధులు,ఉపాధ్యాయులకు,మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల్లో అందరికీ నెగెటివ్ రావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చు కున్నారు. ఈసందర్భంగా ప్రభుత్వ వైద్యులు వీరబాబు, మండల విద్యాశాఖాధికారి గుగులోత్ వెంకట్,సీహెచ్వో వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.