భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీసీతారామచంద్రస్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన,సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు జరిపారు. అనంతరం కల్యాణదాతలకు రామయ్య ప్రసాదాలను, శేష వస్త్రాలను అందజేశారు.