మణుగూరు : భూమి కోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మణుగూరులోని చాకలి ఐలమ్మ నగర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు జీవో జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రాపర్తి శ్రీహరి, కుమ్మరికుంట్ల సుధాకర్, నర్సింహారావు, ముత్యాల బాలరాజు, సోమేశ్, నర్సింహారావుఎ, రమేశ్, రాంబాబు, భిక్షపతి తదితరులు ఉన్నారు.