(ED Action) హైదరాబాద్: విశాఖపట్నంకు చెందిన రెబ్బా సత్యనారాయణ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మోసపూరితంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) చేపల చెరువుల ద్వారా ఐడీబీఐ బ్యాంకును మోసం చేశారని సత్యనారాయణపై ఫిర్యాదులు ఉన్నాయి. దాంతో రెబ్బా సత్యనారాయణ, అతడి కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు రూ.100 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను పీఎంఎల్ఏ కింద ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఈడీ జప్తు చేసిన వాటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ భూములు, చేపల చెరువులు, వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, ఫ్లాట్లు ఉన్నాయి. బ్యాంకు అకౌంట్లను కూడా ఈడీ సీజ్ చేసినట్లు సమాచారం.
రాజమండ్రిలోని ఐడీబీఐ బ్యాంకు నుంచి దాదాపు 143 మంది బినామీల రుణగ్రహీతల పేర్లతో రూ.112.41 కోట్లు చేపల చెరువుల రుణాలు మోసపూరితంగా తీసుకున్నట్లు సత్యనారాయణ, తదితరులపై ఐపీసీ సెక్షన్ల కింద విశాఖపట్నంలోని ఏసీబీ/సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు చెందిన దాదాపు రూ.100 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నిందితుడు 24 లక్షల డాలర్ల విలువైన చేపలను ఎగుమతి చేశారని ఈడీ వెల్లడించింది. సత్యనారాయణ తన బంధువులు, బినామీ పేర్లతో కొనుగోలు చేసిన ఆస్తులను ఇతర వ్యాపార సంస్థల్లో మరోసారి రుణాలు పొందేందుకు తనఖా పెట్టినట్లు సీబీఐ విచారణలో తేలింది.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..