(Payyavula Keshav) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇతరత్రా సమస్యలు ఏవీ లేనట్టగా సినిమా టికెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చించిన అనంతరం పయ్యావుల మీడియాతో మాట్లాడారు.
రైతుల జీవితాల్లో సినిమా కష్టాలను మించిన కష్టాలు ఉన్నాయని పయ్యావుల అన్నారు. వాటి గురించి మంత్రులు, ప్రభుత్వం ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలు, తగ్గిన ఉద్యోగుల వేతనాలు, నిరుద్యోగ యువత కోసం మంత్రులు ఏనాడైనా చర్చించారా? అని నిలదీశారు. రాష్ట్ర మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడం ఎప్పుడో మానేశారని ఎద్దేవా చేశారు.
అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన విద్యుత్ పీఏసీ సమావేశం వాడివేడిగా ముగిసింది. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో లోపాలను పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఎత్తిచూపారు. దాంతో గతుక్కుమన్న అధికారులు.. సరైన సమాచారం తీసుకొని మరోసారి వస్తామని చెప్పారు. ఒప్పందాలపై సంతకాలు చేసేసి సమాచారం లేదంటే ఎలా అని పయ్యావుల ప్రశ్నించారు. ప్రజలకు సమాచారం ఇవ్వరు, కనీసం అసెంబ్లీ కమిటీలకైనా సమాచారం ఇవ్వరా? అంటూ మండిపడ్డారు. పీఏసీకి చెప్పకుండా సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై గోప్యత ప్రదర్శించడంలో ఆంతర్యమేంటన్నారు. అధికారులు సమచారం ఇవ్వకపోవడంతో.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక నుంచి తెప్పించుకోవాల్సి వస్తుందని పయ్యావుల అన్నారు.
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..