మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 18 : జీకే మాస్టర్ షో టోకాన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్నగర్ రూర ల్ మండలంలోని కోడూర్ గ్రామంలో కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు జీకే మాస్టర్ షోటోకాన్ ఆలిండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ కృష్ణయ్య బెల్టులు ప్రదా నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలు కరాటేలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలిండియా కమిటీ చైర్మన్ రవికుమార్, సర్పంచ్ యుగేందర్గౌడ్, ఎంపీటీసీ నాగరాజు, చెన్నయ్యయాద వ్, కరాటే మాస్టర్లు రాజు, శ్రీను, నాగేందర్, అఖిల రవి, ఆంజనేయులు, ప్రసాద్, సురేశ్, శ్రీశైలం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మంత్రి ఎర్రబెల్లిని సన్మానించిన ఉద్యోగ సంఘాల నేతలు
ఒలింపిక్స్లో క్రికెట్.. బీసీసీఐ గ్రీన్సిగ్నల్