(TTD White paper) చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆస్తులు వెల్లడయ్యాయి. శ్రీవారి ఆస్తులపై తొలిసారిగా శ్వేతపత్రం విడుదలైంది. తిరుమల వెంకన్న ఆస్తులపై పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడికావడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి. స్వామివారి ఆస్తుల గురించిన వివరాలు భక్తులకు తెలువాల్సిన అవసరం ఉన్నదని టీటీడీ భావించి ఆ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేయడం విశేషం. భక్తులు సమర్పించిన కానుకల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో టీటీడీ.. రెండు పేజీల్లో ఉన్న శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. శ్వేతపత్రంలోని వివరాలను టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org లో అందుబాటులో ఉంచారు.
శ్రీవారి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న మొత్తం ఆస్తులకు సంబంధించి అందుబాటులో ఉన్న వివరాలను ఈ శ్వేత పత్రంలో పేర్కొన్నారు. ఆస్తుల సంఖ్య 1,128. 8,088 ఎకరాల 89 సెంట్ల వ్యవసాయ భూమి కలిగి ఉన్నది. వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్న సంఖ్య 233. ఇందులో 2,085 ఎకరాల 41 సెంట్ల భూమి స్వామివారి పేరిట ఉన్నది. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 895. ఈ క్యాటగిరీలో ఉన్న స్థలాలు 6,003 ఎకరాల 48 సెంట్లు ఉన్నది.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..