(Viveka Murder) హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ షేక్ దస్తగిరి వెల్లడించిన విషయాలు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివేకా హత్య కేసులో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, రూ.40 కోట్ల సుపారీ ఇచ్చిన వారిని అరెస్టు చేసి విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ నేతలు కూడా ఎదురుదాడి మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్లో ఏ సంఘటన జరిగినా రాజకీయాలతో ముడిపెడుతున్నారని, ప్రజల గురించి గానీ.. రాష్ట్రం గురించి గానీ.. ప్రతిపక్ష పార్టీ ఆలోచించడం లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి ఆదివారం విమర్శించారు. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి గుర్తుచేశారు. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డిని ఇరికించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకేసులో అసలు దోషులకు శిక్ష పడాలన్నారు.
నాన్నకు ప్రేమతో.. ఆ కూతురు ఏం చేసిందంటే..?
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
షుగర్ను ఇలా అదుపులో పెట్టుకోవాలి..! ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..