అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మినీ లాక్డౌన్ ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పగటిపూట కర్ఫ్యూను ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈనేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముందే వ్యాపార సముదాయాలను మూతపడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కర్ఫ్యూ సమయంలో వాహనాలు తిరగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్పోస్టులను ఏర్పాటుచేశారు. అంబులెన్సులు, సరుకులు, మెడికల్ వంటి అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే వదులుతున్నారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు రెండు వారాలపాటు అమల్లో ఉంటాయి. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీళ్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా నిలిపివేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి