భువనగిరి: కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనారసింహ స్వామి కొలువైఉన్న యాదగిరిగుట్టలో లాక్డౌన్ విధించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. నేటి నుంచి పది రోజులపాటు అమల్లో ఉండనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ వెల్లడించారు. లాక్డౌన్ నుంచి పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణం, మెడికల్ షాపులు మినహాయింపు ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ఆత్మకూరు(ఎం) మండలంలో కూడా వారం రోజుపాటు లాక్డౌన్ అమలులో ఉండనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి