చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఉదయం రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ను కలిసి తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదని, అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఈ మేరకు డీఎంకే శాసనసభాపక్షం చేసిన తీర్మానం ప్రతిని గవర్నర్కు అందజేశారు. ఈ విషయాన్ని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మీడియాకు వెల్లడించారు. ఈ ఉదయం గవర్నర్ను కలిసిన వారిలో పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, నేతలు టీఆర్ బాలు, దురై మురుగన్ తదితరులు ఉన్నారని తెలిపారు.