తిరుపతి : (Car Crashed) ఓ వ్యక్తి కారు కొని ఇంటికి తీసుకెళ్తుండగా కారు టైరు పేలి అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏపీలోని తిరుపతి లీలామహల్ సర్కిల్లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి అక్కారంపల్లికి చెందిన లక్ష్మీనరసింహ కొత్త కారును కొనుగోలు చేశాడు. కారును షోరూం నుంచి లీలామహల్ వైపున్న తన నివాసానికి వెళ్తున్న క్రమంలో స్థానిక ఎస్కే ఫాస్ట్ఫుడ్స్ వద్ద కారు టైరు పేలిపోయింది. దాంతో కారు అదుపుతప్పి రోడ్డువారగా ఉన్న జనాలు, వాహనాలపైకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. పార్కింగ్ చేసిన బైకులపై దూసుకెళ్లడంతో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి.
ఘటన అనంతరం కారు యజమాని తిరుపతి తూర్పు పోలీస్స్టేషన్కు వెళ్లి విషయం చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాళేశ్వరంలో కార్తీక శోభ.. భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు.. వైసీపీ శ్రేణుల సంబురాలు
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..