(NV Ramana) విజయవాడ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన అనంతరం తొలిసారిగా ఏపీ రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ ఎన్ వీ రమణకు ఘనస్వాగతం లభించింది. ఇవాళ సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్ వీ రమణ గౌరవార్ధం రాష్ట్రప్రభుత్వం తేనీటి విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి హాజరయ్యారు. సీజేఐ రమణను సీఎం జగన్ స్వయంగా ఆహ్వానించారు. అనంతరం తన క్యాబినెట్లోని మంత్రులను జగన్.. ఎన్ వీ రమణకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి జస్టిస్ ఎన్వీ రమణను మీట్ అయ్యారు. కడప నుంచి విజయవాడకు వచ్చిన సీఎం.. నేరుగా నొవోటెల్ హోటల్ కు వెళ్లి.. అక్కడ బస చేస్తున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ను కలిశారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి జగన్ సీజేఐతో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతకుముందు విజయవాడ నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకు రోడ్డు మార్గంలో చేరకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు.. పొన్నూరులోని వీరాంజనేయ స్వామి ఆలయం, సహాస్ర లింగేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజాలు నిర్వహించారు.
కాగా, రాత్రి 7 గంటల సమయంలో విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సీజేఐ ఎన్ వీ రమణకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. రమణ దంపతులను రోటరీ క్లబ్ నిర్వాహకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అభిప్రాయపడ్డారు. కోర్టుల పనితీరు సరళీకృతంగా ఉన్నప్పుడే ప్రజలకు చేరువవుతాయన్నారు. చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన విధానంలోనే న్యాయం పొందేలా చూడాలని సూచించారు. మన వ్యవస్థలోని మూడు ప్రధాన విభాగాలు సక్రమంగా పనిచేస్తే కోర్టుల జోక్యం తగ్గిపోవడం ఖాయమన్నారు. ఎంతో చైతన్యవంతమైన విజయవాడ.. సైద్దాంతిక విబేధాల కారణంగా బ్లేజవాడగా మారేట్లుగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడతో తనకు ఎంతో అనుబంధమున్నదని తన చిన్ననాటి, విద్యార్థిగా ఉన్న సమయం రోజులను గుర్తుచేసుకున్నారు. ఎన్నో రంగాలకు నెలవైన విజయవాడ.. అప్పటిమాదిరిగా మాత్రం లేదని మాత్రం చెప్పగలనన్నారు. మాతృభాషలో పునాది సరిగా లేకపోతే.. అభివృద్ధి జరుగదని, అందుకని మాతృభాషను మరువొద్దని ఎన్వీ రమణ సూచించారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..