(Padayatra) నెల్లూరు : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతులు చేపట్టిన పాదయాత్ర 34వ రోజుకు చేరుకున్నది. నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో ఇవాళ పాదయాత్ర చేపడుతున్నారు. దాదాపు 11 కిలో మీటర్ల మేర పాదయాత్ర.. తిప్పవరప్పాడు, కందరోడ్డు, చెమిర్తి మీదుగా కొనసాగనున్నది. చెమిర్తిలో భోజన విరామం అనంతరం.. కొమ్మనేటూరు, తిరువెంగళాయపల్లి మీదగా పుట్టంరాజువారి కండ్రిగకు చేరి అక్కడ ముగియనున్నది.
రైతులు చేపట్టిన పాదయాత్రకు తిప్పవరప్పాడు వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ స్వాగతం పలికారు. కాగా, రైతులు శుక్రవారం రాత్రి సైదాపురంలో రోడ్డు పక్కనే ఓ ప్రైవేటు స్థలంలో టెంట్లు వేసుకుని బస చేశారు. గూడూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రకు హాజరై యాత్ర చేపట్టిన రైతులకు ఘనంగా స్వాగతించారు. మహిళలు, యువత రైతుల అవసరాలు తీరుస్తూ పాదయాత్ర సజావుగా సాగేందుకు సహకరిస్తున్నారు. రోడ్డుపైనే భోజనాలు చేసే పరిస్థితులు రావడంతో పలువురు మహిళా రైతులు ఇబ్బందికి గురయ్యారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..