Balka suman | చెన్నూర్, ఫిబ్రవరి 11 : చెన్నూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మంత్రి వివేక్ వెంకట స్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా చెన్నూర్లోని అంబేద్కర్ విగ్రహం ముందు బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకట స్వామి బైక్లపై పోలింగ్ బూత్ల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చెన్నూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చెన్నూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ తన తన కారులో 15 లక్షల రూపాయలను, మందు కాటన్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు.
చెన్నూర్ మున్సిపాలిటీలో రెండవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త పెద్దింటి శ్రీనివాస్ ఓటర్లకు డబ్బులు బహిరంగంగా పంచుతున్న వీడియో బయటకు వచ్చిందని, దీన్నిబట్టి చూస్తుంటే ఎన్నికలు ఎంత దుర్మార్గంగా జరుగుతున్నాయో స్పష్టమవుతున్నాయని బాల్క సుమన్ అన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు పోలింగ్ బూత్ల వద్ద విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్
నల్లగొండలో ఓటేసిన ట్రాన్స్జెండర్లు
Chennuru | పోలింగ్ రోజూ మంత్రి వివేక్ ప్రచారం..! ఎన్నికల సంఘం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు