Food Poison | కాంగ్రెస్ సర్కార్ పాలనలో నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లోని గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు చాలా జరిగాయని తెలిసిందే. తాజాగా ఓ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులతోపాటు ఓ ఉపాధ్యాయుడు అస్వస్థతకు లోనయ్యారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ బారిన పడి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయుడిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి అస్వస్థత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ బారిన పడి అస్వస్థతకు గురైన ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు
వాంతులు, విరోచనాలు కావడంతో… pic.twitter.com/LoMs80VWVz
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2026
SI Srinivas | యువత భవిష్యత్తు గంజాయితో నాశనం : ఎస్సై శ్రీనివాస్
MLA Kova Laxmi | మహంకాళి జాతరలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు
Hanuman Jayanti | భక్తిశ్రద్ధలతో ఘనంగా హన్మాన్ జయంతి వేడుకలు