MLA payal Shankar | ప్రభుత్వ భూములను కాపాడి వాటికి రక్షణగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఆ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారు. అధికార పార్టీల నేతలే ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూకబ్జా వ్యవహారం బయటపడ్డదని తెలిసిందే.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పేరిట పది ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. పాయల్ శంకర్ అదిలాబాద్ జిల్లా బత్తిసవర్గం గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనం సమీపంలో ఉన్న ఏడు ఎకరాల అసైన్డ్ భూమితోపాటు 3 ఎకరాల ప్రభుత్వ భూములను తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు.
సదరు భూములను అమ్మడానికి, కొనడానికి అవకాశం లేదని గతంలో ఆదేశాలు ఉన్నా కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆ భూములను లేఔట్ చేసి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. గతంలో ఇదే భూములపై అక్రమంగా తెచ్చుకున్న ఎన్వోసీ రద్దు అయిన విషయం చెప్పకుండా, అదే ఎన్వోసీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు నిర్దారించారు. పాయల్ శంకర్ కబ్జా చేసిన 11 ప్లాట్ల విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా.
ప్రభుత్వ భూములను కాజేసిన బీజేపీ ఎమ్మెల్యే
తన భార్య పేరిట పది ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్ జిల్లా బత్తిసవర్గం గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనం సమీపంలో ఉన్న ఏడు ఎకరాల అసైన్డ్ భూమితో పాటు మూడు ఎకరాల ప్రభుత్వ… pic.twitter.com/DwU37ICs0i
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2026