parampara in OTT | కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఓటీటీ హవా బాగా నడుస్తున్నది. తెలుగులోనూ వెబ్సిరీస్ల జోరు కొనసాగుతున్నది. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరించడంతో బాలీవుడ్, టాలీవుడ్లోని పెద్దపెద్ద నటీనటులు కూడా వెబ్సిరీస్ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా డిస్నీ హాట్స్టార్ మొట్టమొదటి తెలుగు స్పెషల్ సిరీస్ ‘పరంపర’ను ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉంది.
సీనియర్ హీరోలు జగపతిబాబు, శరత్కుమార్లు ఇందులో నటిస్తున్నారు. ముఖ్య తారాగణంగా నవీన్చంద్ర, ఇషాన్, ఆకాంక్ష సింగ్ నటిస్తున్న ఈ వెబ్సిరీస్కు కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహిస్తున్నారు. హాట్స్టార్లో ఈ నెల 24 నుంచి ఇది ప్రసారం కానుంది. ‘పరంపర కథలో ఒక ప్రత్యేకత ఉంది. అధికారం కోసం పోరాటాలు, మోసం, కుటుంబ కలహాలతో ప్రేక్షకులు రోలర్కోస్టర్ రైడ్ని ఆస్వాదిస్తారు. నేను చేస్తున్న మోహన్రావు పాత్ర అందర్నీ తప్పకుండా ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకుంది. పాత్ర విషయంలో నేను ఆనందంగా ఉన్నాను. సిరీస్ మొత్తం అలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు జగపతిబాబు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Netflix | ఇండియాలో భారీగా సబ్స్క్రిప్షన్ ధరలు తగ్గించిన నెట్ఫ్లిక్స్
OTT | 2008లోనే భారత్లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్ఫామ్స్తో లాభమా? నష్టమా?
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
సర్కారు వారి పాట విషయంలో ఆ రిస్క్ వద్దు అంటున్న మహేశ్బాబు..